రష్మీ అందాల విందు అంతకుమించి

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లి తెర యాంకర్ రష్మీ, సతీష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అంతకు మించి’ . ప్రముఖ దర్శకుడు జానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా కథ ఒక హారర్ థ్రిల్లర్ అని ఇదే వరకే చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగులో గతంలో వచ్చిన హర్రర్ సినిమాలకు ఈ సినిమాకి ఎంతో తేడా ఉంటుందని, ఈ సినిమా పూర్తిగా కొత్త కథాంశంతో చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు. సినీ ప్రేక్షకులకి కావాల్సిన అన్ని హంగులు, కమెర్షియల్ సన్నివేశాలు మరియు మాస్ మసాలా సీన్స్ అన్ని ఈ చిత్రం లో భాగమని దర్శకుడు వెల్లడించారు.
ఇక రష్మీ ఈ సినిమాలో తన అందాలను బాగానే ఆరబోసిందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ప్రేక్షకులని ఈ సినిమాలో ఘాటైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చిత్ర వర్గాల అభిప్రాయం. ఈ మూవీని ఎస్ జే ఫిలిమ్స్ బ్యానర్ పై సతీష్ నిర్మిస్తున్నారు. సహా నిర్మాతలుగా భాను ప్రకాష్, కన్నా వ్యవహరిస్తారు. బాల్ రెడ్డి ఈ హర్రర్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. చిత్ర విడుదల తేదిని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

Share.