చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మన్సూర్ అలీ ఖాన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త పై నిలుస్తున్నాడు. ఈ మధ్యలో ఈయన నటించిన చిత్రం లియో.. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష నటించిన విషయం మనకు తెలిసిందే ..అయితే ఈమెపై ఈయన చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

Chiranjeevi condemns Mansoor Ali Khan for comments on Trisha; Mansoor  refuses to apologise - The Hindu

మన్సూర్ అలీ ఖాన్ ఇది వరకు తను నటించిన సినిమాల్లో  హీరోయిన్లతో కలిసి చాలా సినిమాలలో రేప్ సీన్లలో నటించాను. ఈ సినిమాలో కూడా త్రిషతో అలాంటి సీన్లే ఉంటాయని భావించాను కానీ ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేవని ఆమెను రేప్ చేసే అవకాశం తనకు రాలేదు అంటూ అసభ్యకరంగా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై సినీ సెలబ్రిటీ లందరూ త్రిష కే మద్దతును తెలుపుతున్నారు.

ఈ విషయంపై కూడా చిరంజీవి త్రిషకి మద్దతు తెలుపుతూ ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.అయితే తన పరువుకు భంగం కలిగించారని నిజానిజాలు తెలియకుండా తన గురించి చెడుగా మాట్లాడారు అంటూ మన్సూర్ అలీ ఖాన్ త్రిష చిరంజీవి కుష్బూ పై కేసు వేయబోతున్నట్లు ప్రకటించారు.అయితే తాజాగా మరోసారి చిరంజీవి వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ మారుతున్నాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి ప్రతి సంవత్సరం హీరోయిన్లకు మాత్రమే పార్టీ ఇస్తారు.. ఎప్పుడు కానీ నన్ను పిలవలేదు. అది ఆయన ఇష్టం అలాగే నా మీద ఇలాంటి ఆరోపణలు వేసేటప్పుడు నాకు ఒక్కసారి ఫోన్ చేసి ఏం జరిగిందనే విషయం మాట్లాడితే బాగుండేదని అలా కాకుండా చిరంజీవి గారు నా గురించి అలాంటి మాటలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించాయని మాట్లాడారు.త్రిష ,ఖుష్బూ చిరంజీవిపై కేసు పెట్టి పరువు నష్టం దావ ద్వారా వచ్చిన డబ్బుతో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ఆ డబ్బును ఇస్తానంటూ ఈ సందర్భంగా మన్సూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share.