తారకరత్న అంతిమయాత్రలో అనూహ్య ఘటన.. బాలయ్యకు హెచ్చరిక..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గుండెపోటుకు గురైన తారకరత్న దాదాపు 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తరలించి.. కుటుంబ సభ్యులు, ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని మోకిలాలోని స్వగృహంలో ఉంచారు.

అనంతరం ఈరోజు ఉదయం ఫిలిమ్ ఛాంబర్ కి తరలించి అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మరి కొద్ది సేపట్లో నందమూరి తారకరత్న అంత్యక్రియలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలోనే అనూహ్య ఘటన చోటుచేసుకుంది . అక్కడికి ఒక పిచ్చోడు ఎంటర్ అయ్యి తారకరత్నకు నివాళులర్పించిన తర్వాత బాలయ్య బాబుతో జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

తారకరత్న భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచినప్పుడు అనూహ్య సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఒకరు తారకరత్న భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన నేరుగా నందమూరి బాలకృష్ణ దగ్గరకు వెళ్లి వేలెత్తి చూపుతో గట్టిగా మాట్లాడారు.. ఆయన చెప్పింది బాలకృష్ణ కూడా శ్రద్ధగా విన్నట్టు తెలుస్తోంది . తర్వాత పోలీసుల ఆ వ్యక్తిని బయటకు లాక్కొని వెళ్లిపోయారు. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరిగిన దుస్తులతో కనిపించాడు ఆ వ్యక్తి .. అయితే ఫిలింనగర్ పరిసరాలలో రోడ్లపై తిరుగుతూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.

Share.