యంగ్ హీరో నుంచి ఎన్టీఆర్ ఇంటికి బిర్యాని..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిర్యానీ అంటే ఇష్టం లేనివారు ఎవరు ఉండరు ఆ సంగతి మనకు తెలిసిందే.. అయితే ఇండస్ట్రీలో కూడా ఒక హీరో మటన్ బిర్యానీ అంటే పడి చచ్చిపోతారట. ఇంతకు ఆ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. చాలా సందర్భాల్లో కూడా తారక్ ఈ విషయాన్ని వెల్లడించారు .బావార్చిలో ఫ్యామిలీ ప్యాక్ బిర్యాని ఒక్కడినే తినేస్తానని తారక్ పలు సందర్భాల్లో తెలపడమే కాకుండా కొన్నిసార్లు తాను కూడా ఇంట్లో చేస్తూ ఉంటానని తెలిపారు.

Naga Shaurya's Love for Jr NTR is Unmatchable

అయితే నాగశౌర్యకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అలాగే నాగశౌర్య తల్లి ఉష ఇప్పటికే నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. ఈమె ముల్ఫారీస్ కిచెన్ పేరుతో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేశారట.. ఆ రెస్టారెంట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు మటన్ బిర్యానీ అందింది. అయితే ఈ విషయాన్ని నాగశౌర్య తల్లి ఒక యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇస్తు వెల్లడించింది. అలాగే ఆమె బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతోందని ఈ సందర్భంలో తెలియజేశారు.

అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు రెస్టారెంట్ కి వస్తున్నారని అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ డ్రైవర్ మటన్ బిర్యానీ ని కలెక్షన్ చేసుకున్నారని ఎన్టీఆర్ ఆర్డర్ చేయటంతో ఈ యంగ్ హీరో రెస్టారెంట్ నుంచి బిర్యానీ వెళ్లిందట.జూనియర్ ఎన్టీఆర్, నాగశౌర్య కుటుంబాల మధ్య మంచి స్నేహబంధం ఉండేదని తెలిపారు.. ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి కూడా నాగశౌర్యకు తనకు అక్క లాంటిదట .ఎన్టీఆర్ ఈ మధ్యనే RRR సినిమా ద్వారా ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .ఈ సినిమాతో మళ్లీ తనకు బిగ్గెస్ట్ హిట్ దక్కాలని మరీ మరీ కోరుకుంటున్నారు. అంతేకాకుండా దేవర సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు కూడా తెలుస్తోంది.

Share.