తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే కచ్చితంగా వారి వెనకాల పలుకుబడి ఉండాలి అలా కాదని సింగిల్ గా ఎంట్రీ ఇస్తే వారు ఒకటి రెండు సినిమాలు మాత్రమే తీస్తారు. కానీ వారి కెరీర్ మాత్రం ముందుకు సాగదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సలోని అందరికీ సుపరిచితమే.. ఈ అమ్మడు మహారాష్ట్రకు చెందిన అమ్మాయి ఈమె అసలు పేరు వందన తన తండ్రి వృత్తిరీత్యా మహారాష్ట్రలో జన్మించారు .
కానీ ముంబైలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. తన తండ్రికి సినిమాల్లో ఈమె నటించడం ఏమాత్రం ఇష్టం లేదట .కానీ తన తల్లికి ఇష్టం ఉండటంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టించి.. ఆ తర్వాత పలు సినిమా అవకాశాలను అందుకునెలా చేసింది.అయితే సలోని మొదట్లో మగధీర సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకుని తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో నటించింది.
కానీ ఆమెకు అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు. ఆ తరువాత వచ్చిన సినిమాలకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేసిందట సలోని.ఇక ఇలాగా చేయడంతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త పక్కన పెడితే మర్యాద రామన్న సినిమాకు ఈమెనే హీరోయిన్గా రాజమౌళి తీసుకోవడానికి ఒక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది.
రాజమౌళి సలోని హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేయటానికి ఒక కారణం ఉంది అదేంటంటే.. రాజమౌళికి స్వయాన బంధువు కావటంతోనే తనని హీరోయిన్గా సినిమాల్లో తీసుకున్నారని తెలుస్తోంది. మరి సలోని రాజమౌళికి ఏ విధంగా బంధువు అనే విషయానికి వస్తే రాజమౌళి అన్నయ్యగా భావించే ఎం ఎం కీరవాణి కి సలోని చాలా దగ్గర బంధువుతుందట. అలా కీరవానికి చుట్టాలు కావడంతో ఆమెని మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశారట.