తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు పొందిన జంట మహేష్ బాబు,నమ్రత జంట. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్ లైఫ్ లో జంటగా నటించిన వీరు రియల్ లైఫ్ లో కూడా ఒక్కటయ్యారు. వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా అది కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. మహేష్ , నమ్రత దంపతులకు సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది నమ్రత.
ఒకవైపు మహేష్ బాబు భార్యగా తన పిల్లలకు తల్లిగా పలు బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు మహేష్ బిజినెస్ లను కూడా చూసుకుంటూ సక్సెస్ ఫుల్ భార్యగా పేరుపొందింది. సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు చిత్రాలకు సంబంధించి తమ కుటుంబానికి సంబంధించి ఏవైనా విషయాలను పంచుకుంటూ ఉంటుంది నమ్రత. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా నమ్రత పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఈమె బోర్ కొట్టి హీరోయిన్గా మారానని తెలియజేసింది. తన కెరియర్లో టర్నింగ్ పాయింట్ అంటే మహేష్ బాబు తో లవ్ పడడమే అన్నట్లుగా తెలియజేసింది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉండనే ఉంటాయి అలా మీ మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అని ప్రశ్ని అడగగా.. ఈ విషయంపై స్పందిస్తు నమ్రత .. మా మధ్య ఖచ్చితంగా మా పిల్లల వల్లే గొడవలు వస్తాయని మా పిల్లలు అడిగినది నేను కాదు..వద్దు అంటాను వెంటనే వాళ్లు మహేష్ దగ్గరికి వెళ్లి అందుకు ఒప్పిస్తూ ఉంటారని తెలియజేసింది.
దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతాయని తెలియజేసింది. అలాగే సితార గురించి మాట్లాడుతూ సితార తాము కోరుకోలేదని..తను అన్ఎక్స్పెక్టెడ్ బేబీ అని తెలియజేసింది నమ్రత. గౌతమ్ పుట్టిన తర్వాత తమ లైఫ్ పూర్తిగా మారిపోయిందని తెలియజేసింది నమ్రత. మహేష్ నటించిన పోకిరి చిత్రం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.