బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ యాక్టర్స్(ఫోటోలు)

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చుసిన ఇదే చర్చ. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గ వ్యవహరించారు. మొదటి సీజన్ ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఇక ఇప్పుడు రెండో సీజన్ కి నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సీజన్ 2 లో సెలబ్రిటీస్ తో పాటు సామాన్య ప్రజానీకానికి కి కూడా అవకాశం కల్పించారు షో నిర్వాహకులు. ఈ సారి ముగ్గురు కామన్ పీపుల్ కి ఇందులో లాటరీ విధానం ద్వారా పాల్గొనే అదృష్టం లభించింది. అందులో ఒకరు సంజన ఈ మద్యనే షో నుండి ఎలిమినేట్ కావడం కూడా జరిగింది.
ఇక ఈ రోజు షో లో టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్ మరియు శ్రీనివాస రెడ్డి గెస్ట్స్ గ వచ్చారు. వీరిద్దరూ నటించిన తాజా చిత్రం “జంబ లకిడి పంబ” త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి పబ్లిసిటీ లో భాగంగా ఈ ఇద్దరు స్టార్ కమెడియన్స్ బిగ్ బాస్ హౌస్ కి గెస్ట్ లు గ వచ్చారని సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలని ప్రముఖ పీ ఆర్ వంశి కాకా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

Share.