ఓవరాక్షన్ తగ్గిస్తే బెటర్ విజయ్…రష్మిక షాకింగ్ ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గ మారిపోయారు, ఈ డాషింగ్ హీరో ఇప్పుడు తెలుగు యువతుల కలల రాకుమారుడు. కేవలం ఒకే ఒక్క సినిమా “అర్జున్ రెడ్డి” తో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు విజయ్. సోషల్ మీడియా లో కూడా మన అర్జున్ రెడ్డి తన ఫ్యాన్స్ తో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. సాధారణంగా మన స్టార్స్ పర్సనల్ గ ఎంత ఫ్రెండ్లీ గ ఉన్న సోషల్ మీడియా లో మాత్రం చాల జాగ్రత్తగా సంభాషిస్తారు. తాజాగా 65th ఫిలింఫేర్ అవార్డ్స్ లో విజయ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు.
దీనికి హీరోయిన్ రష్మిక మందాన విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది, వెంటనే విజయ్ దేవరకొండ ” గీత మేడం మీతో టైం గడపడం నాకు నిజమైన ఆనందం ఇవి వస్తుంటాయి, పోతుంటాయి…. అవార్డు లో ఎం ఉంది మేడం, మీ లాంటి వాళ్ళు నన్ను ప్రేమించటం చాలు..గీత మేడం” అని సరదాగా రీట్వీట్ చెసారు.
బదులుగా రష్మిక ” ఇగో గోవిందం ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది, అసలు ఈ అవార్డు ఎన్టీఆర్ కి గాని ప్రభాస్ కి గాని ఇచ్చి ఉంటె మాకు ఈ గొడవ ఉండేది కాదు” అని ట్వీట్ చెసారు. ఇది ఇలా ఉండగా వీరిద్దరూ కలిసి ‘గీత గోవిందం’ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు అనే విషయం తెలిసిందే అందులో భాగంగానే సినిమాకి కొత్తగా పబ్లిసిటీ చేస్తున్నారు అని నెటిజన్స్ కి తరువాత అర్ధం అయ్యింది. సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా వీరి సరదా సంభాషణ సోషల్ మీడియా లో వైరల్ గ మారింది.

“గీత గోవిందం” సినిమాని ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించగా, సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం వారు ఈ నెల 23 న విడుదల చేయనున్నారు.

Share.