టాలీవుడ్ మార్కెట్ మీద కన్నేసిన రణబీర్ కపూర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి సినిమాని తీసి సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు యానిమల్ సినిమాతో కూడా అంత మంచి సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని రూపొందించారు. యానిమల్ సినిమాలో హీరోగా రనబీర్ కపూర్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.. అయితే ఆయన ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. రనబీర్ కపూర్ హిందీలో తన సత్తా చాటాడు.. కానీ తెలుగులో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు.

Ranbir Kapoor's Animal finally gets a release date after being postponed |  Bollywood - Hindustan Times

అయితే సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ తో రనబీర్ కపూర్ చేస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులో ఎలాగైనా సరే టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ లో సందీప్ రనబీర్ కపూర్ ని ఒక యానిమల్ లాగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కనుక నిజం అయితే రణబీర్ తెలుగులో తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నట్లే … హీరోయిన్ రష్మిక కూడా ఆన్ ఇండియా లెవెల్ లో పుష్ప సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది ఇప్పుడు యానిమల్ సినిమాలో కూడా ఈమె నటిస్తున్నది.

ఆయన ఇంతకు ముందే బ్రహ్మాస్త్రం సినిమా ద్వారా భారీ డిజార్డర్ నీ మూటకట్టుకున్నాడు. తెలుగులో అయితే ఆ సినిమాను పట్టించుకున్న వారే లేరు అందుకే ఈ సినిమా మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే బాలీవుడ్ లో మరొకసారి తన సత్తా చాటుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే మన తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో తన సత్తా చాటాడు.. ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయటానికి చూస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే కనుక మన తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో కూడా టాప్ పొజిషన్లో చేరుతారేమో చూడాలి మరి.

Share.