సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. యూత్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. చిత్రలహరి సినిమాకు ముందు వరకు పెద్దగా సక్సెస్ కానీ ఈ యువహీరో, చిత్రలహరి హిట్ తో తిరిగి గాడిలో పడ్డాడు. ఇక ప్రస్తుతం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టర్టైనర్ గా డిసెంబర్ 20న విడుదలైన ప్రతిరోజూ పండగే సినిమా ఓ మోస్తరుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఫ్యాన్స్ ఈ సినిమా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దీనికి దగ్గట్టే భారీగా ప్రచారం కూడా చేశారు. గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రంలో మారుతీ ఏదో కొత్తగా చూపించారనే భావన ప్రేక్షకుల్లో కలిగించగలిగారు. విదేశాలలో సెటిల్ అయిన ఆయన కొడుకులు ఆయన చనిపోకముందే, కార్యక్రమాలు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. అయితే తాత కోసం.. కుటుంబాన్ని ఒకే చోటకు చేర్చేందుకు మనవడు పడే తాపత్రయమే ఈ చిత్ర కథ.
అయితే కథలో కొత్తదనం ఏమీ లేదు కానీ.. ఫస్టాఫ్లో కొన్ని కామెడీ, ఎమోషనల్ సీన్స్తో దర్శకుడు లాక్కొచ్చేశాడని చెప్పాలి. సాయి ధరమ్ తేజ్కు తాతగా నటించిన సత్య రాజ్ మాత్రం మరోమారు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన రూలర్ లాంటి మాస్ ఎంటర్టైనర్తో పోటీ పడటం మొదటి రోజు కలెక్షన్లపై కాస్త ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటి రోజు ఎంత కలెక్షన్ రాబట్టిందో ఓ సారి లుక్కేసేయండి.
ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం – 1.28 కోట్లు
సీడెడ్ – 35 లక్షలు
గుంటూరు – 30 లక్షలు
ఉత్తరాంధ్ర – 34 లక్షలు
ఈస్ట్ – 31 లక్షలు
వెస్ట్ – 23 లక్షలు
కృష్ణా – 22 లక్షలు
నెల్లూరు – 18 లక్షలు
—————————————
ఫస్ట్ డే మొత్తం షేర్ – 3.21 కోట్లు
—————————————