నెపోటిజంపై అలాంటి వ్యాఖ్యలు చేసిన కృతిసనన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎవరి అండ లేకుండా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్.. అయితే మహేష్ బాబు తో మొట్టమొదటిగా నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా అంతగా ఆమెకు సక్సెస్ ని అందించలేదు. అంతేకాకుండా మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. అందుకే బాలీవుడ్ కు మాఖం మార్చేసి అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసింది. ఈ మధ్యనే ప్రభాస్ తో ఆది పురుష్ సినిమాతో తెలుగు లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో విమర్శలను అందుకుంది.

Kriti Sanon: 'If you're launching someone from the industry, make sure…' |  Bollywood - Hindustan Times
కానీ కృతి సనన్ కి మాత్రం తన నటన పరంగా మంచి మార్పులే దక్కాయి.దీంతో ఈ బ్యూటీకి ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మోడలింగ్ నుంచి బాలీవుడ్ టాప్ హీరోయిన్‎గా ఎదగడానికి తన పడిన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అలాగే బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి వారి గురించి కూడా మాట్లాడింది. కృతి సనన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో బయట వ్యక్తులకు కూడా సమాన హక్కు ఉండాలని తెలుపుతోంది..

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్, ప్రొడ్యూసర్స్ వారసులు తెరంగేట్రం చేస్తే వాళ్లకు వెంటనే ఎక్కువగా అవకాశాలు వస్తాయి. కానీ ఎప్పుడు సొంతవారికే కాకుండా ఇతర వ్యక్తులకు కూడా ఛాన్సులు ఇస్తే బాగుంటుందని కృతి సనన్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. పెద్ద స్టార్స్ కంటే ప్రపంచం ఇప్పుడు ప్రతిభ ఉన్నవారి వైపు , కొత్త స్క్రిప్ట్‌ల వైపు మొగ్గు చూపుతోంది” అంటూ చెప్పుకొచ్చింది.

అయితే నెపోటిజం గురించి కృతి సనన్ మాట్లాడటం ఇది మొదటి సారి ఏమీ కాదు ఇలా చాలాసార్లు మాట్లాడింది. అలాగే తనకు ఎన్నో అవకాశాలు చేజారిపోయాయని తనకు వచ్చిన పాత్రల్లో స్టార్ కిడ్స్ ని ఎంచుకోవడం జరిగిందని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.. మరొకసారి ఇప్పుడు ఇలాంటి వార్తలలో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

Share.