జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ పై ఫైర్ ఆయన జడ్జెస్ కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై అప్పుడప్పుడు ఆసక్తికర సంఘటనలు జరుగుతూ ఉండటం కామన్ విషయం.. దాదాపు 15 ఏళ్లుగా జబర్దస్త్ షో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈ షో ద్వారానే కమెడియన్స్ పరిచయమయ్యారు బుల్లెట్ భాస్కర్.. అంతేకాకుండా మంచి సక్సెస్ ని సాధించి సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు.యాంకర్లు మారిన జడ్జిలు మారిన స్కిట్ చేసే వాళ్ళు మారిన జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు షోలు దూసుకుపోతున్నాయి. అయితే జడ్జిల మధ్య కమెడియన్స్ మధ్య ఎన్నో గొడవలు షో మధ్యలో వెళ్లిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో లో జడ్జిగా ఉంది ఖుష్బూ అయితే ఇందులో బుల్లెట్ భాస్కర్ ఒక విషయంపై ఫైర్ అయ్యాడట.భాస్కర్ టీం ఈసారి నిజం మూవీ స్పూఫ్ తీసుకున్నారు .అయితే గోపీచంద్ పాత్రని భాస్కర్ చేశాడు అయితే జడ్జిగా వ్యవహరిస్తున్న కృష్ణ భగవాన్ నిజం సినిమాలో గోపీచంద్ కి గుండు ఉంటుంది నీకు లేదేంటి అని అన్నాడు. దీనికి భాస్కర్ అది ముందే చెప్పాలి స్కిట్ మధ్యలో అడిగితే ఎలా అని కోపం తెచ్చుకున్నాడు.

దీంతో ఖుష్బూ చేస్తే కరెక్ట్ గా చేయాలి లేకుంటే చేయకూడదు అని అనడంతో భాస్కర్ కి కోపం వచ్చి స్కిట్ కోసమే ప్రాణం పెడతాను గుండు గీయించుకోలేనా అంటూ స్టేజ్ పైనే గుండు గీయించుకున్నాడు. దీంతో కృష్ణ భగవాన్ మేము ఎఫెక్ట్ ఉంటే చాలు అన్నాం నిజంగానే గుండు గీయించుకోమని చెప్పలేదు. అప్పుడు భాస్కర్ ఇది మీరు గుండు గీయించుకోకముందు చెప్పాలి ఇప్పుడు చెప్తే ఏం లాభం బొచ్చు వెనక్కి రాదు కదా అని సీరియస్ అయ్యాడు.

దీంతో కుష్బూ మేము జడ్జి సీట్లో ఉండి ఏం చెప్పకూడదా? మాకు ఫ్రీడం లేదా అంటూ సీరియస్ అయింది. దీంతో ఇద్దరు జడ్జీలు లేచి వెళ్లిపోయారు. ఇలా చాలా సార్లు జరిగాయి..కానీ ప్రోమోలో ఇది ఒక భాగం అని చాలామంది అనుకుంటారు.అయితే ఈసారి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Share.