టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సినిమాతో పరిచయమైన అమ్మడు అనుష్క శెట్టి హీరోయిన్ గా ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే అనుష్క కూడా ఆ తర్వాత వచ్చిన సినిమాలతో క్రేజ్ ను పెంచుకుంది. అరుంధతి, బాహుబలి, బాహుబలి 2 చిత్రం ద్వారా ఈ అమ్మడు పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా మారింది.అయితే సైజ్ జీరో సినిమాతో ఆమె కెరీర్ ని నాశనం చేసుకుంది. ఎందుకంటే ఆ సినిమాలో వెయిట్ ఎక్కువ కావటం అలాగే ఆ సినిమా అనుష్క కి సెట్ కాకపోవడం ఇవన్నీ ఆ సినిమా మైనస్ వల్లే జరిగాయి. అంతేకాకుండా ఆ సినిమా తీసిన తర్వాత అనుష్క లావు తగ్గలేకపోతోందట. అంతేకాకుండా సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.ఇది కాస్త పక్కన పెడితే
ఈ మధ్యనే మళ్లీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో రిఎంట్రి ఇచ్చింది. అయితే ఆ సినిమా సక్సెస్ బాట నడచడంతో మళ్లీ అనుష్కకి తన కెరీర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్ల తెలుస్తోంది. అయితే అనుష్కకి ఇప్పటికే ఏజ్ పెరిగిపోతోంది.పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అనుష్క పెళ్లి చేసుకోవడానికి సిద్ధం లేదని సమాచారం.
అంతేకాకుండా ఆమెకి తగ్గ స్టోరీలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేయాలనే విషయం లో చాలా బిజీగా ఉంటుంది.అందుకే ప్రతి డైరెక్టర్ చెప్పే కథలను వింటూ ఆమె కు నచ్చిన కథలను సెలెక్ట్ చేసుకుంటూ డైరెక్టర్లతో ఆ క్యారెక్టర్లకు సంబంధించిన డిజైనింగ్ కూడా అద్భుతంగా చేయించుకొని ఆ క్యారెక్టర్ లో జీవించి అందరూ మెప్పు పొందుతుంది. ఇలాంటి క్రమంలో ఆమెను యంగ్ దర్శకులు కూడా ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఆమె తగ్గట్టు కొన్ని కథలను కూడా రెడీ చేస్తున్నారు.
అయినప్పటికీ అనుష్క మాత్రం సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. ఇలా ఎంతవరకు అనుష్క సినిమాలలో రాణిస్తుందో అలాగే ఆమె పూర్వ వైభవం మళ్లీ తిరిగి వస్తుందో లేదో వెయిట్ చేయాల్సిందే.. ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది అనుష్క.