టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో పాటు నిర్మాతలు కూడా క్రేజ్ ని సంపాదించుకున్నారు. అందులో టాప్ 2 లో ఉన్న నిర్మాత లిస్టులో కచ్చితంగా దిల్ రాజ్ ఉంటారు. ఈయన వరస హిట్ సినిమాలతో నిర్మాతగా మంచి గుర్తింపుని సంపాదించుకొని అంచలంచలు ఎదిగాడు ఈయన ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే ముద్ర పడుతుంది. దిల్ రాజ్ ముఖ్యంగా కథలను జడ్జి చేసే విషయంలో దిల్ రాజును మించిన నిర్మాత తెలుగు ఇండస్ట్రీలో లేరని అనవచ్చు.
కానీ మెగాస్టార్ విషయంలో మాత్రం ఈయన లెక్క తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే అప్పట్లో దిల్ రాజు,రామ్ చరణ్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే అప్పట్లో ఆయన చిరంజీవిని కలిసి ఈ సినిమా స్టోరీ వినిపించాడట. అయితే చిరంజీవి ఈ కథ మొత్తం విని ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి ఇది వర్క్ అవుట్ అవ్వదు అని చెప్పేశాడట. అయితే దిల్ రాజ్ మాత్రం లేదు సార్ కచ్చితంగా చరణ్ కి సరిపోతుంది అంటూ చిరంజీవిని ఒప్పించే ప్రయత్నం చేశాడట.
అయితే ఒకసారి ఈ కథని నాగబాబుకి వినిపించు అతని ఫైనల్ నిర్ణయం తీసుకో ఆ తర్వాత చూస్తాను అని చెప్పాడట. నాగబాబు కూడా చిరంజీవి చెప్పినట్లే చెప్పటంతో ఇదేంటి ఇంత మంచి కథని ఏమి లోపాలు కనిపించాయి అని మనసులో అనుకున్నాడట. అప్పుడే నాగార్జున తన పెద్ద కొడుకు నాగచైతన్య లాంచ్ చేయటానికి కథలు వింటూ ఉన్నాడు. అదే టైంలో దిల్ రాజు కూడా జోష్ సినిమాని నాగచైతన్యతో చేస్తానని చెప్పాడట. ఫలితంగా ఈ సినిమా పెద్ద ఫ్లాప్ కావటం కోటి రూపాయలు నష్టాన్ని మిగిలించడం జరిగాయి. చిరంజీవి మాట కాదన్నందుకు ఇలా జరిగింది అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు.