సాహో ఎఫెక్ట్‌… జాన్‌తో మ‌ళ్లీ షాక్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా నెగెటివ్ టాక్ సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. నష్టాలు వచ్చినా బాలీవుడ్లో మాత్రం రు.155 కోట్ల షేర్ తో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసింది. భయంకరమైన తట్టుకుని కూడా భయంకరమైన నెగిటివ్ టాక్ ను తట్టుకుని కూడా సాహో 150 కోట్లకు పైగా షేర్ సాధించ‌డం అంటే మామూలు విషయం కాదు. ఇక సాహో రిజ‌ల్ట్‌తో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా జాన్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

జాన్‌ స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జాన్‌ను ఫుల్ ఎంటర్ టైనర్ గా మలచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వెన్నెల కిషోర్ రోల్ కి సంబధించిన సీన్స్ చాల బాగా అలరిస్తాయని తెలుస్తోంది. గోపీచంద్‌తో జిల్ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ రొమాంటిక్ స్టోరీ 1960వ ద‌శ‌కం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతోంది.

మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. రూ.180 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సాహో ఇచ్చిన రిజ‌ల్ట్‌తో ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా చేయాల‌ని చూస్తున్నారు.

ఈ లెక్క‌న మ‌రో యేడాదిన్న‌ర‌కు పైగా అంటే 2020 వ‌ర‌కు కాని ప్ర‌భాస్ సినిమా కోసి వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే గ‌త ఆరేడ‌ళ్ల‌లో కేవ‌లం మూడు సినిమాల‌తోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ నెక్ట్స్ సినిమా విష‌యంలో మళ్లీ సుదీర్ఘ నీర‌క్ష‌ణ త‌ప్ప‌దు.

Share.