అల వైకుంఠపురములో.. అల్లు ఫ్యామిలీ వేలు పెట్టుడు ఎక్కువైందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా విషయంలో అల్లు ఫ్యామిలీ వేలు పెట్టుడు ఎక్కువవుతుందని తెలుస్తుంది.

సినిమా అవుట్ పుట్ బాగా రావడం కోసం నిర్మాతగా అల్లు అరవింద్ తను ప్రొడ్యూస్ చేసే సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడతాడు. అయితే అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అరవింద్ ఎక్కువ వేలు పెడుతున్నట్టు తెలుస్తుంది. తను నిర్మించడమే కాకుండా అల్లు అర్జున్ సినిమా కాబట్టి అరవింద్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా నుండి వచ్చిన మూడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. పోటీగా వస్తున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు గట్టి పోటీ ఇచ్చేలా అల వైకుంఠపురములో సినిమా వస్తుంది.

Share.