‘శ్రీనివాస కళ్యాణం’ టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

నితిన్, రాశి ఖన్నా జంటగా దిల్ రాజు సమర్పణలో నిర్మించిన తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ చిత్ర టీజర్ ని చిత్ర బృందం ఇటీవలే విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మిక్కీ జె మేయర్ స్వరాలూ సమకూర్చారు. మొన్న రిలీజ్ చేసిన థీమ్ టీజర్ లో పెళ్లి ప్రాముఖ్యతని వివరించగా ఈ టీజర్ లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలని వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా చూపించారు. కేవలం అబ్బాయిలకే అమ్మాయిలు ముద్దొస్తారా.. అమ్మాయిలకు అబ్బాయిలు ముద్దొస్తారని డైలాగ్ యువతని ఆకట్టుకుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఆగష్టు 9 న విడుదల కానుంది.

Share.