సీరియల్ కు ఎపిసోడ్ డైరెక్టర్ గా పని చేసిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయారు. బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆర్ ఆర్ ఆర్ సినిమాను కూడా ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నాడు. ఇకపోతే సాధారణంగా దర్శకులతో నటులు గొడవ పడడం సహజమేనని, ఈ నేపథ్యంలోనే రాజమౌళితో ఒక నటుడు గొడవపడడంతో సినీ ఇండస్ట్రీ కొద్దిరోజుల పాటు బ్యాన్ చేసింది. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఆ నటుడు.
అతను ఎవరో కాదు ప్రముఖ నటుడు, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన రంగనాథ్.. 300 చిత్రాలకు పైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎస్.వి.రంగారావు లాగా ఎంతో పేరును కూడా సంపాదించుకున్నారు.రాజమౌళి తన కెరియర్ మొదట్లో శాంతి నివాసం అనే సీరియల్ కి డైరెక్టర్ గా వ్యవహరించారు.
ఈ సీరియల్ సమయంలో కూడా ఇతనికి రాజమౌళికి మధ్య గొడవ జరగడంతో ఈ సీరియల్ నిర్మాత కె.రాఘవేంద్రరావు మరికొందరు కలిసి ఆయనను ఇండస్ట్రీలో బ్యాన్ చేశారు. అప్పటికే తన భార్య అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల ఏదో ఖర్చులకోసం సినిమాలలో నటిస్తున్న రంగనాథ్ కు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, అదే సమయంలో తన భార్య మరణించడంతో ఆయన మానసికంగా ఎంతో కుంగిపోయారు. ఇలా మానసికంగా ఎంతో కృంగిపోయిన రంగనాథ్ చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.