నటనకు గుడ్ బై చెప్పిన రాహుల్…కారణం అదేనా?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘చి ల సౌ’ విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రముఖ నటుడు సుశాంత్ ఈ చిత్రం లో హీరో గా నటించాడు. అన్నపూర్ణ సంస్థ వారు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సాధారణంగా ఇండస్ట్రీ లో హీరోగా బాగా అనుభవం వచ్చినా తరువాత దర్శకులుగా మారుతుంటారు. కానీ రాహుల్ మాత్రం అతి కొద్దీ సినిమాల్లో నటించిన తర్వాతే దర్శకుడిగా మారిపోయారు. తన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే రాహుల్ కి టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ నుండి వరుసగా రెండో సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది.

ఇటీవలే నాగార్జున ‘చి ల సౌ’ సినిమా చూసి బాగా ఇంప్రెస్స్ అయ్యారట, వెంటనే రాహుల్ ని అభినందించి, తన సంస్థ లో మరో సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం కల్పించారట నాగార్జున. దీనితో ఆనంద పడిన రాహుల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక అన్నపూర్ణ వంటి సంస్థ లో వరుసగా రెండు సినిమాలకి డైరెక్టర్ గా పని చేసే అదృష్టం రావటంతో ఫ్యూచర్ లో రాహుల్ పూర్తిగా దర్శకత్వం పైనే ఫోకస్ చేయనున్నారని ఇండస్ట్రీ లో టాక్. రాహుల్ ముందు ముందు తెరపై హీరో గా కనిపిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Share.