చికాగో రాకెట్ నిజాలు బయటపెట్టిన మెహ్రీన్..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెహ్రీన్ కౌర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఆగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న హీరోయిన్. అయితే తాజాగా కొన్ని అనవసర వివాదాలు తనని చుట్టుకున్నాయి. గత కొంత కాలంగా టాలీవుడ్ ని కుదిపేస్తున్న చికాగో రాకెట్ లో తనని పోలీసులు ప్రశించారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మెహరీన్‌ ఈ చిత్ర ప్రమోషన్లలో మీడియాపై మండిపడ్డారని, అందుకే తనని కొన్ని వివాదాల్లోకి లాగారనే వార్త ఇండస్ట్రీ లో వినిపిస్తుంది. ఈ రోజు మెహ్రీన్ తన అఫిషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వీటన్నిటికీ సమాధానం చెప్పారు.

మా ఫ్యామిలీతో నేను వాంకోవర్ నుంచి లాస్ వెగాస్‌ కు వీకెండ్ హాలిడే ట్రిప్ కోసం వెళుతుండగా అక్కడ పోలీసులు నన్ను ఎయిర్ పోర్ట్ లో కొద్దీ సేపు ప్రశ్నించారు, అమెరికా కి ఎందుకు వచ్చారని అడిగారని, అప్పుడే నేను చికాగో రాకెట్ గురించి ఆ ఆఫీసర్స్ ద్వారానే తెలుసుకున్నాను. నాకు ఆ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని తెలిశాక, వారు నాకు సారీ చెప్పి అక్కడ నుండి పంపించేశారు.అలాగే మొన్న జరిగిన పంతం ఈవెంట్ గురించి వివరిస్తూ… వైరల్ ఫీవర్‌ కారణంగా పంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేక పాయనని, అంతే కాకుండా తనకి మీడియా తో చాల మంచి రేలషన్ ఉందని చెప్పారు మెహ్రీన్.

తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచిది, నాకు జీవితాన్ని ఇచ్చినా తెలుగు ఇండస్ట్రీ కి ఎప్పుడు చెడ్డ పేరు తెచ్చేలాగా నేను చేయనని, కొంత మంది చేసిన తప్పు వలన ఇండస్ట్రీ మొత్తానికి బ్యాడ్ నామ వస్తుందని చెప్పింది. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్న.
చివరగా మీడియా మిత్రులకి నా విన్నపం “దయచేసి నా గురించి వార్తల్ని నన్ను సంప్రదించకుండా ప్రచురించవద్దని” అన్నారు.

Share.