అప్పుడు హరి కృష్ణ డబ్బులు కట్టి వెళ్లారు: కీరవాణి

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు, మాజీ రాజ్య సభ సభ్యుడు నందమూరి హరి కృష్ణ గారు నిన్న ఉదయం రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. నిన్నటి నుండి ఆయనకి ప్రముఖులు నివాళులు అర్పిస్తూనే ఉన్నారు, తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ కే సి ఆర్ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో అంతిమ యాత్ర చేయనున్నాం అని తెలిపారు. అయన మరణ వార్త తెలియ గానే తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రం లో మునిగి పోయింది. ప్రముఖులు అంత హరి కృష్ణ తో వారికున్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఇక ఈ రోజు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి హరి కృష్ణ గురించి ఎవరికీ తెలియని ఒక వార్త ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయన మాటల్లో ” ఎన్టీఆర్ గారు సి ఎం గా ఉన్నపుడు ఒక రోజు హైదరాబాద్ లోని ముషీరాబాద్ దగ్గర హరి కృష్ణ గారు సిగ్నల్ జంప్ చేసి వెళ్లటంతో పొలిసు వారు హరి కృష్ణ గారిని చలానా కట్టి వెళ్లామన్నారు, అయితే హరి కృష్ణ తాను ఎన్టీఆర్ గారి కొడుకునని చెప్పకుండా హుందాగా చలానా కట్టి వెళ్లారని తెలిపారు ఎం ఎం కీరవాణి.

Share.