సినీ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె ఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. తాజాగా ఆయన అతని ఊరు నుంచి హైదరాబాద్ కి తిరిగి వస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా అతనికి ఫిట్స్ వచ్చి, కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారు. అతని అటల్ మరణంతో సినీ పరిశ్రమలో ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అలాగే నాగేశ్వరరావు మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దర్శకుడి భౌతికకాయాన్ని ప్రస్తుతం వారి అత్తగారి ఊరైన నల్లజర్ల దగ్గర లోని కౌలూరీ గ్రామంలో ఉంచారు. అక్కడే నాగేశ్వరరావు అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. అతనికి కుమారుడు,కూతురు, భార్య కూడా ఉన్నారు. ఇక అతని సినిమాల విషయానికి వస్తే రిక్షా రుద్రయ్య అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనంతరం స్టార్ హీరో శ్రీహరి నీ పోలీస్ అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. ఆ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది.