చిరుతో బోయపాటి సినిమా … ఆపింది ఎవరు…?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలివుడ్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు మాస్ ఎలాంటి సినిమాలు అయితే చూస్తారు అనేది స్పష్టంగా తెలుసు. ఏ హీరోతో ఏ విధంగా సినిమా తీస్తే అభిమానులు చూస్తారో కూడా ఆయనకు ఒక క్లారిటి ఉంది. హీరోకి తగిన విధంగా కథ రాస్తూ… ఆ కథను వాళ్ళతో మాత్రమే చేసే విధంగా తుది మెరుగులు దిద్దుతూ ముందుకి వెళ్తాడు బోయపాటి… బాలకృష్ణ తో తీసిన సింహ, లెజెండ్, అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు…

రవి తేజా తో తీసిన భద్ర సినిమాలు చూస్తే స్పష్టంగా అర్ధమవుతాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఆయనకు ఊహించని షాక్ లు ఇచ్చాయి… ఎన్టీఆర్ తో చేసిన దమ్ము, రామ్ చరణ్ తో చేసిన వినయ విదేయ రామ సినిమాలు షాక్ ఇచ్చాయి. దమ్ము సినిమా తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వినయ విదేయ రామ తర్వాత కూడా అదే పరిస్థితి వచ్చింది అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. వినయ విదేయ రామకు అభిమానులు కులం అంట గట్టారు.

ఆయన కమ్మ కాబట్టే ఆ సినిమా ఫ్లాప్ అని మాట్లాడారు. ఆ సినిమా తర్వాత… చిరంజీవి కోసం బోయపాటి కథ రాసారట… సైరా సినిమా తర్వాత చిరు ఓకే అంటే ఆ సినిమా చేద్దామని భావించారట. కాని… అందుకు… కథను కూడా చిరుకి వినిపించే ప్రయత్నం చేసారట. దీనికి అల్లు అర్జున్ అడ్డు పడ్డారని అంటున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ బోయపాటి మంచి ఫ్రెండ్స్. వినయ విదేయ రామ సినిమా ఘోరంగా ఉందనే అభిప్రాయం చిరులో కూడా ఉందని, కావాలనే ఎన్నికల కోసం మీరు హడావుడిగా సినిమా పూర్తి చేసారని, అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందని చిరు కూడా నమ్ముతున్నారని వెళ్ళినా ఉపయోగం లేదనే చెప్పారట.

Share.