శ్రీరెడ్డి లానే మరో టాలీవుడ్ భామ.. యూత్ ఆడియెన్స్ ఇంత కరువులో ఉన్నారా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీ రెడ్డి ఫిల్మ్ చాంబర్ దగ్గర సెమీ న్యూడ్ అవతారం అందరికి తెలిసిందే. ఆమె చేసిన నిరసన అప్పట్లో హాట్ న్యూస్ అయ్యింది. అప్పటినుండి శ్రీ రెడ్డి ఓ సెన్సేషన్ గా మారింది. అయితే ఆ సెన్సేషన్ ను ఇప్పుడు సినిమాలో వాడుకున్నారు ఏడు చేపల కథ టీం. టెంప్ట్ రవి చేసే టెంప్టింగ్ పనులకు టీజర్, ట్రైలర్ తోనే ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఏడు చేపల కథ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగు రెండు రాష్ట్రాల్లో 600 స్క్రీన్స్ లో రిలీజైన ఈ సినిమా కోసం యూత్ ఆడియెన్స్ ఎగబడ్డారు. అయితే ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ చేసిన ఓ సీన్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. శ్రీ రెడ్డి లానే బట్టలిప్పేసి పెద్ద బొట్టు పెట్టుకుని భాను శ్రీ అచ్చం శ్రీ రెడ్డిని ఇమిటేట్ చేసింది. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరిని శ్రీ రెడ్డి గుర్తుకు వస్తుంది.

యాంకర్ గా చేస్తూనే బుల్లితెర సీరియల్స్ కూడా చేస్తూ వచ్చిన భాను శ్రీ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం మాత్రం ఎవరు ఊహించి ఉండరు. చిన్న సినిమాగా వచ్చిన ఏడు చేపల కథ నిన్న యూత్ ఆడియెన్స్ అందరు చూడటంతో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉంది. ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూసి ఆడియెన్స్ ఇంత కరువులో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.

Share.