ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్. ఒకటి రెండు హిట్స్ వచ్చినా హీరోగా తన ఇమేజ్ను కాపాడుకోవటంలో ఈ యువ నటుడు ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ‘కుమారి 21ఎఫ్’ తరవాత రాజ్ తరుణ్ పది సినిమాలు చేసినా ఏ ఒక్కటీ సరిగా ఆడలేదు. అయినప్పటికీ రాజ్ తరుణ్కి అవకాశాలు తగ్గలేదు. వరుస పరాజయాలతో కొనసాగుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్..తాజాగా ‘ఇద్దరి లోకం ఒకటే’ తో మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో సుధీర్ బాబుతో ఆడు మగాడ్రా బుజ్జీ సినిమాతో దర్శకుడిగా పరిచమైన జి.ఆర్.కృష్ణ చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాను తెరెక్కించాడు.
ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటించింది. విషాదాంత ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎలాంటి అంచనాలులేకుండా నిన్న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ ను రాబట్టుకోవడంతో పాటు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ ఓపెనింగ్ ను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి లోకం ఒకటే చిత్రం 50లక్షల షేర్ ను కూడా రాబట్టలేదని సమాచారం.
నైజాం లో 22లక్షల షేర్ ఉత్తరాంధ్ర లో కేవలం 4లక్షల షేర్ ను రాబట్టింది. అయితే ఈ సినిమా లవ్ లైక్స్ కో ఇన్సిడెన్స్ స్ అనే సినిమాకి రీమేక్. ఇక స్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్ను భరించడం కష్టమే అనిచెప్పాలి. మిక్కీ జే మేయర్ పాటలు మినహా సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదనంటున్నారు కొందరు. ఇక కామెడీ అస్సలు లేకపోవడం, సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అయింది. ఇక ఈచిత్రం తో రాజ్ తరుణ్ కెరీర్ లో వరుసగా 7వ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.