ఎన్.టి.ఆర్ ను ఫాలో అవుతున్న మహేష్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు టాలీవుడ్ సూపర్ హీరోస్. ఒకరిని ఒకరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండా ఇద్దరు తమ స్టామినాతో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అయితే అలాంటిది సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం తారక్ ను ఫలఓ అవుతున్నాడట మహేష్. అనీల్ రావిపుడి డైరక్షన్ లో మహేష్ హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కర్నూలు ఎపిసోడ్ హైలెట్ గా ఉండబోతుందట.

ఈ ఎపిసోడ్ లో మహేష్ తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు కర్నూలులో మహేష్ అక్కడ యాస మాట్లాడుతాడని తెలుస్తుంది. అరవింద సమేత సినిమాలో సీమ యాసతో సత్తా చాటాడు తారక్. పాత్ర ఏదైనా ఘట్టమేదైనా నేను రెడీ అంటూ గర్జించే తారక్ పాత్రకు కావాల్సిన ఆహార్యం.. అభినయం చూపిస్తాడు. అందుకే ఈ విషయంలో తారక్ ను ఫాలో అయితే బెటర్ అని మహేష్ భావిస్తున్నాడట.

ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. కామెడీలో తన పెన్ పవర్ ఏంటో చూపించే అనీల్ రావిపుడి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి ప్రతిభ చూపిస్తాడని తెలుస్తుంది. 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మహేష్ కు హ్యాట్రిక్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Share.