ప్రముఖ నటుడు అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గూఢచారి’, ఈ చిత్రం టీజర్ ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేసారు. యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు చిత్ర బృందం. చివర్లో భవనం కూలిపోతుందనగా అడివి శేష్ కిందికి దూకే సన్నివేశం టీజర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు దర్శకుడు హాలీవుడ్ సినిమాలా స్థాయిలో చిత్రీకరించారు.
శశి కిరణ్ టిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. ప్రకాశ్రాజ్, వెన్నెల కిశోర్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 3న ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉందని చిత్ర యూనిట్ ప్రకటించింది.