మొన్నటి వరకు ఎక్కడ చూసినా భారీగా కురిసిన వర్షాలతోనే ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికే కొన్ని గ్రామాలు వరద నీటిలోనే చిక్కుకున్నాయి. అంతేకాకుండా భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లి కొన్ని గ్రామాలను నేలమట్టం చేశాయి. దీంతో ప్రభుత్వాలు కాస్త ఆదుకున్న అప్పటికి కూడా ఫలితం లేకుండా పోతోంది. ఎందుకంటే వర్షం పడుతూనే ఉండడంవల్ల నీటి ప్రవాహం పారుతూనే ఉంది.అలా చెరువులకు గండ్లు పడడంతో 39 మంది గల్లంతయ్యారు. వారిలో 27 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగితా వారి ఆచూకీ కోసం అధికారులు వెతుకుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఏపీకి మరో ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో మరోసారి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండేటువంటి నగరాలలో తిరుపతి, నెల్లూరు, కర్నూలు నగరాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సుమారు 13 సెం.మీ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు.