త్వరలోనే సోషల్ మీడియాకి గుడ్ బై అంటున్న బండ్ల గణేశ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్.. స్టేజీ మీదకు వచ్చాడంటే చాలు పూనకాలే అని చెప్పొచ్చు. చేతిలో మైక్ ఇస్తే ఇక ఆయన మాటల ప్రవాహం ఆపడం కష్టమే. మరీ ముఖ్యంగా తన బాస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి చెప్పాలని కోరితే ఇక అంతే సంగతులు.. కాగా, గణేశ్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో? చెప్పడం కష్టమే. 2018 ముందుస్తు అసెంబ్లీ ఎన్నికలకు మందుర సడెన్‌గా కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేశ్ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే రాజకీయాల నుంచి వెనక్కు వచ్చేశాడు.

‘సరిలేరునీకెవ్వరు’ చిత్రంలో కమెడియన్ రోల్ ప్లే చేశాడు. ఈ క్రమంలోనే సినిమానే తన జీవితమని ప్రకటించాడు. కమెడియన్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌‌గా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బండ్ల ఒక సెన్సేషన్ అని అంటుంటారు పవన్ ఫ్యాన్స్. సోషల్ ఇష్యూస్, పర్సనల్ లైఫ్, సినిమాలతో పాటు పలు విషయాలపై బండ్ల ట్వీట్స్ నెట్టింట వైరలవుతూ ఉంటాయి. కాగా, బండ్ల గణేశ్ తాజాగా షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగానే తాను సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ట్విటర్ గుడ్ బై చెప్పేస్తానని, తనకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దని బండ్ల పేర్కొన్నారు. తన జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నానని బండ్ల ట్వీట్‌ చేశాడు. దీంతో బండ్ల, పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Share.