టాలీవుడ్‌లో భయపడిపోతున్న హీరోయిన్లు…!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్లు భయపడిపోతున్నారు. సినిమాలు చెయ్యాలన్నా సరే వాళ్ళు వంద ఆలోచించుకునే పరిస్థితి నెలకొంది. సినిమాల్లోకి రాజకీయాలు రావడం, అవి ఎటు వెళ్తున్నాయో అర్ధం కాక వాళ్ళల్లో ఒకరకంగా భయం నెలకొందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. కొన్ని నెలలుగా టాలివుడ్ లో ఐటి దాడులు అనేవి భయపెడుతున్నాయి. ప్రముఖ నిర్మాతలను, కొందరు హీరోలను లక్ష్యంగా చేసుకుని ఐటి దాడులు అనేవి జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు,

హీరోలు నానీ, సహా కొందరి మీద ఐటి దాడులు జరిగాయి. తాజాగా లావణ్య త్రిపాఠి మీద కూడా ఐటి దాడులు జరిగాయని ప్రచారం ఎక్కువగా జరిగింది. దీనితో హీరోయిన్లు ఇప్పుడు సినిమాలు చెయ్యాలి అంటే చాలు భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాదికి చెందిన ఒక హీరోయిన్ ని బినామీగా పెట్టారని వార్తలు వచ్చాయి. దీనితో అగ్ర నిర్మాతలతో సినిమాలు అంటే చాలు హీరోయిన్లు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. నిర్మాతలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట.

తేడా వస్తే తాము కోర్టుల చుట్టూ తిరగలేమని, తమకు అంత సామర్ధ్యం లేదని, రంగుల ప్రపంచం చూసి వచ్చామని, నాలుగు రూపాయలు వెనకేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం గాని ఇలాంటి వాటిల్లో ఇరుక్కుని జీవితం మీద మచ్చ వేయించుకునే సాహసం మేము చేయలేమని చెప్పెస్తున్నారట. అటు హీరోయిన్ల తల్లి తండ్రులు కూడా దీనిపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా లేకపోయినా పర్వాలేదు గాని, ఆ తలనొప్పులు వద్దని వాపోతున్నారట. మరి ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

Share.