పుష్ప సినిమా కి చీఫ్ గెస్ట్ గా రెబల్ స్టార్.. నిజమేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ఈ పాన్‌ ఇండియన్ చిత్రంగా డిసెంబర్ 17వ తేదిన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే తగ్గేదే లే అన్నట్టుగా ఇప్పటికే ప్రమోషన్స్‌ని జోరుగా చేస్తున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరపబోతున్న పుష్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పుష్ప మేకర్స్ ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఈ ఈవెంట్ కి వస్తే కనుక పాన్ ఇండియా స్టార్‌గా ఎదగాలనుకుంటున్న అల్లు అర్జున్‌కి ఇది నిజంగా కలిసొచ్చే అవకాశమేనని చెప్పుకోవచ్చు. అయితే ఈ వేడుక గురుంచి కానీ, ముఖ్య అతిధి గురుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చిత్ర యూనిట్ నుంచి రాలేదు.

Share.