ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి నిన్న తన అధికారిక ట్విట్టర్ ద్వారా దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పై విరుచుకు పడ్డారు. ఆమె ఎయిర్ ఇండియా పై వరుస ట్వీట్లతో తన కోపాన్ని వ్యక్తం చేసారు. లక్ష్మి మంచు ట్వీట్ చేస్తూ ” ఎయిర్ ఇండియా వారు నన్ను 4 గంటల నుండి ఎయిర్ పోర్ట్ లోనే ఎదురుచూసేలా చేసారు, ముందుగా ఉదయం 12.15 am ( అర్ధరాత్రి ) ఫ్లైట్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఇంకో 2 గంటలు సమయం పడుతుందని చెబుతున్నారు. ఇక్కడి నిర్వహులు కూడా సరిగా సమాధానము ఇవ్వటంలేదు, ప్రయాణికులకు సరైన ఆహారం, నీరు సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇక చేసేదేమి లేక హైదరాబాద్ లోని సిబ్బందికి ఫోన్ చేసి, పూణే లోని విమానం ఏమైందో అడగమని చెప్పను. వారు ప్రయాణానికి వాతావరణం అనుకూలంగాలేదని, కొన్ని అనుకోని సాంకేతిక కారణాల వలన విమానాల్ని మార్చామని అబద్ధాలు చెప్పారు. ఇలా ప్రయాణికుల్ని 4 గంటలపాటు ఎదురుచూసేలా చేయటంలో మీకు వచ్చే ఆనందం ఏంటో అని తన ఆవేదన వ్యక్తం చేసారు లక్ష్మి మంచు.
ఇక మరో ట్వీట్ లో రాత్రి 9.30 కి బయలుదేరవలసిన విమానం సుమారు 5 గంటల ఆలస్యంగా ఉదయం 3 గంటలకి స్టార్ట్ అవుతుందేమో అని తెలిపారు లక్ష్మి మంచు.
Dear @airindiain u made wait 4 hrs in the airport with ur lies of we will take off shortly and now when we are supposed to take off at 12.15am now u tell us another 2 hr delay. An officer walks away as he speaks to me.. No food no water no information.. Stranded in pune! Now what
— Lakshmi Manchu (@LakshmiManchu) October 17, 2018
And now I get information from hyderabad to tell the ground staff in pune whats happening with their flt. They lie bad weather when they changed flts because of technical issues.. What is joy in keeping passengers in the dark for over 4 hrs @airindiain??
— Lakshmi Manchu (@LakshmiManchu) October 17, 2018
9. 30pm flt hopefully will take off by 3am. @airindiain???
— Lakshmi Manchu (@LakshmiManchu) October 17, 2018