ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా లోని ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే.. ఒకసారి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాల మధ్య విడుదల తేదీ కోసం చాలా గట్టి పోటీనే నడుస్తోంది. ఏ సినిమా అయినా ఎక్కువగా పండుగ సమయాలలోనే విడుదల చేయడం వల్ల, బాగా కలెక్షన్లు వస్తాయనే నమ్మకం దర్శకనిర్మాతల లో ఉన్నది. అయితే ఈసారి అందరి చూపు ఎక్కువగా సంక్రాంతి పండుగ వైపే ఉండడం గమనార్హం.
2022 సంక్రాంతి మొత్తం థియేటర్లో స్టార్ హీరోల సందడి మొదలుకానుంది. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలే విడుదల అవడం గమనార్హం. ఇక ఒకసారి బాక్స్ ఆఫీసు పై దండయాత్ర చేయనున్నారు. ముందుగా సంక్రాంతి బరిలో సర్కారు వారి పాట, RRR , భీమ్లా నాయక్, రాధే శ్యామ్ వంటి సినిమాలు పోటీలో ఉన్నాయి. కానీ ఇందులో నుంచి.. సర్కారు వారి పాట సినిమా తప్పుకోగా.. మిగతా మూడు సినిమాలు గట్టి పోటీయే సిద్ధమయ్యాయి. దీంతో ఒకేసారి ఎన్ని సినిమాలు విడుదల అయితే నిర్మాతలు నష్టపోతారని భావించిన దిల్ రాజు, భీమ్ నాయక్ సినిమా నిర్మాతల తో మాట్లాడి ఆ సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఇక మిగిలింది రాధే శ్యామ్ మూవీ మాత్రమే.
తాజాగా రాజమౌళి ఇటీవల ఒక ట్వీట్ చేశారు. అందులో భీమ్లా నాయక్ సినిమా వాయిదా వేయాలని నిర్ణయానికి నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దానికంటే ముందు మహేష్ బాబు తన సినిమాని సంక్రాంతి నుంచి తప్పించినందుకు.. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి థాంక్యూ మై హీరో అని ట్వీట్ చేశాడు.