నందమూరి బాలకృష్ణ హీరోగా, హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ సినిమాను ద్వారక క్రియేషన్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా బోయపాటి శ్రీను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా బాలయ్య, బోయపాటి శ్రీనుకు హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కిస్తుడడం విశేషం. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు సినిమాపై మంచి ఆసక్తిని నెలకొన్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా నుండి జై బాలయ్య అనే పాటను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ అందిస్తున్నారు. ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. అయితే తాజాగా ఈ పాట పై నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాలయ్య ఫుల్ ఫ్లో లో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. మాస్ జాతరను డిసెంబర్ 2వ తేదీన థియేటర్లో చూసేందుకు ఆగలేక పోతున్నాను అంటూ తెలియజేశారు.
Jai Balayya !!
Babai in full flow !!
Can’t wait for the mass jathara in theaters from Dec 2nd.
– https://t.co/20SauR6e4E#Akhanda
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 28, 2021