ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయనకు పితృవియోగం కలగడంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీను తండ్రి వైట్ల కృష్ణారావు 83 సంవత్సరాల వయసులో ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈయన స్వగ్రామం స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.
కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లవారుజామున కృష్ణారావు తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర విషాదంతో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్ల కు ఫోన్ చేసి పరామర్శిస్తారు.