ఆచార్య సినిమా..ఆ ఓటిటి సంస్థ డీల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తన కొడుకు నిర్మాతగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించడం విశేషం. ఇక రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే, చిరంజీవి తోకాజల్ నటిస్తోంది. ఈ సినిమాకి డైరెక్టర్ గా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై మెగా అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ బిజినెస్ ను జరుపుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నది.

Amazon Prime Subscription in India to Be Hiked Soon, Annual Plan Will Cost Rs 1499

థియేటర్లో భారీ బిజినెస్ జరుపుకున్న ఆచార్య సినిమా ఒక ఓటీటీ సంస్థ తో కూడా డీల్ కుదుర్చుకున్నట్లు గా తెలుస్తోంది. ఈ సినిమాను దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో వారితో డీల్ కుదుర్చుకున్నట్లు గా తెలుస్తోంది. థియేటర్ లో విడుదలైన కొన్ని వారాలకే ఈ సినిమా ఓటీటి లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిశర్మ అందిస్తున్నాడు. ఇక అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడా ఈ సినిమా కోసం భారీ ఇ మొత్తాన్ని ఖర్చు చేసినట్లుగా సమాచారం.

Share.