అఖండ టీమ్ తో కలిసి తిరుమలలో దర్శనం ఇచ్చిన బాలయ్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అఖండ.ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటించింది. ఇందులో హీరోయిన్ పూర్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఇక హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటించారు. మరొక ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు కూడా నటించారు. డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా.

 2021లో ఓవర్సీస్‌లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ యేడాది ఓవర్సీస్‌లో విడుదలైన ‘వకీల్ సాబ్’ తో పాటు ‘లవ్ స్టోరీ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు ఏవి యూఎస్‌లో 1 మిలియన్ యూఎస్ డాలర్లు వసూళ్లు చేయలేకపోయాయి. కానీ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఊర మాస్ చిత్రం ‘అఖండ’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో పర్ఫామెన్స్ చేస్తోంది. (Twitter/Photo)

ఇక అందుకుగాను ఈ సినిమా మా సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులతో తిరుమలకు వెళ్లారు బాలకృష్ణ. ఇప్పటికే బాలకృష్ణ వీరితో పాటుగా కనకదుర్గమ్మ ని కూడా దర్శించుకున్నారు. ఇక ఆ తర్వాత నరసింహస్వామి దేవాలయం కూడా సందర్శించారు. ఇక ఇప్పుడు తాజాగా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. నీకు ఈ సందర్భంగా తన సినిమా సక్సెస్ కు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు బాలక్రిష్ణ. ఇక ఈ ఏడాది ది హైయెస్ట్ గ్రాసర్ లో నిలిచింది అఖండ.

 ఇప్పటికే ఓవర్సీస్ మొత్తం కలిసి 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. తాజాగా ఒక్క యూఎస్ బాక్సాఫీస్ దగ్గరనే ‘అఖండ’ మూవీ 1 మిలియన్ యూఎస్ డాలర్స్ వసూళు చేసింది. మొత్తంగా 15 రోజులుగా ఈ సినిమా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తూనే ఉంది. (Twitter/Photo)

Share.